- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రాష్ట్రంలో రాక్షస పాలన
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్ల కు ఎవరూ భయపడరని, రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తుందని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను ఎమ్మెల్యే హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం ముందుగా మేలుకుంటే ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
వరద బాధితులకు సాయం చేయడానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెళ్తే దాడి చేసి కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారని, వరద ప్రాంతాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితులకు సాయం అందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు నెల వేతనం అందిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలన్నారు. వరదల ప్రభావంతో ఇండ్లు నీళ్లలో మునిగిపోయిన వారికి రూ.2 లక్షల తక్షణ సాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.