'ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి'

by Vinod kumar |
ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీనవ్ పాటిల్ అధికారులను అదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో సెక్టార్, రూట్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన మ్యానువల్ బుక్స్, అండ్ బుక్స్ లో నిబంధనలను కలెక్టర్ వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాుడుతూ.. ఎన్నికల విధినిర్వహణలో అలసత్వం వహించవదన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ... ఓటర్లను ప్రభావితం చేసే వారిపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు, ఆర్డీఓలు రమేష్ బాబు, బెన్ షాలోమ్, బన్సీలాల్, ఏసీపీలు సురేందర్ రెడ్డి, రమేష్, సతీష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.

Advertisement

Next Story

Most Viewed