Collector : ఈ నెల 30న సంగారెడ్డికి బీసీ కమిషన్ బృందం

by Kalyani |   ( Updated:2024-10-26 12:36:46.0  )
Collector : ఈ నెల 30న  సంగారెడ్డికి  బీసీ కమిషన్ బృందం
X

దిశ, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ( Telangana BC Commission ) ప్రతినిధుల బృందం ఈ నెల 30 న సంగారెడ్డి కి వస్తుందని కలెక్టర్ క్రాంతి వల్లూరు ( Collector Kranti Vallur ) తెలిపారు.

ఉమ్మడి మెదక్ ( సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ) జిల్లాలకు బంధించి ఈ నెల 30 న సంగారెడ్డి లోని ఐసీసీ కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని తెలిపారు . అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించవచ్చని సూచించారు. వారి అభ్యర్థనలతో పాటు నిర్దేశిత నమూనాలో వెరిఫికేషన్ అఫిడవిట్ ఆరు సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ కు నివేదించవచ్చని కలెక్టర్ సూచించారు.

Advertisement

Next Story