- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Minister : భవాని మాత ఆశీర్వాదంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి
by Kalyani |
X
దిశ, హుస్నాబాద్: రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ విజయదశమి జరుపుకుంటామని ప్రతి ఒక్కరు దుర్గా భవాని అమ్మవారి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ,సిరిసంపదలతో ఈ సంవత్సరం ప్రారంభించే అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకున్నారు. దసరా పర్వదినాన శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు సమర్పించుకొని ఆశీర్వాదం తీసుకోవడం తెలంగాణలో గొప్ప సంస్కృతి సంప్రదాయానికి నిదర్శమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ పెద్దల ఆశీర్వాదం తీసుకుని భవిష్యత్తులో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
Advertisement
Next Story