- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోడీ జన సభ ఏర్పాట్ల పరిశీలన
దిశ,అల్లాదుర్గం : అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద ఈ నెల 30న బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరై నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహకంలో భాగంగా బీజేపీ ఈనెల 30న రెండు లక్షలకు పైగా జన సమీకరణ చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్ చందర్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ జనసభ సమావేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అల్లాదుర్గంలో జరిగే జనసభలో పాల్గొనేందుకు కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో నేరుగా సభాస్థలికి చేరుకునేందుకు ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ వద్ద ఆదివారం వాయుసేన హెలికాప్టర్ సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేస్తున్న స్టేజీ నిర్మాణ పనులను నాయకులు పరిశీలించారు.