ప్రకృతి ప్రకోపం.. భారీ వర్షానికి కూలిన 55 గృహాలు..

by Sumithra |   ( Updated:2024-09-03 09:08:18.0  )
ప్రకృతి ప్రకోపం.. భారీ వర్షానికి కూలిన 55 గృహాలు..
X

దిశ, పాపన్నపేట : ప్రకృతి ప్రకోపానికి ప్రజలు నష్టపోతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పాపన్నపేట మండలంలో సుమారు 55 గృహాలు కూలిపోయాయని తహశీల్దార్ సతీష్ కుమార్ వెల్లడించారు. ఘటనా స్థలాలకు వెళుతూ నిర్ధారించుకుంటున్నామని ఆయన వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో తాము ఉండేందుకు గూడు లేకుండా పోయిందని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పాపన్నపేటకు చెందిన దోసని లక్ష్మయ్య ఇల్లు కూలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక తహశీల్దార్ సతీష్ కుమార్ కు సమాచారం అందించగా సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మండలంలో కూలిపోయిన మిగతా ఇళ్లను సైతం సిబ్బంది పరిశీలిస్తూ పంచనామా నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed