అగ్ని ప్రమాదానికి గురైన టపాసుల దుకాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

by Kalyani |
అగ్ని ప్రమాదానికి గురైన టపాసుల దుకాణాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్
X

దిశ, కార్వాన్: అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన స్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. సోమవారం బొగ్గులకుంట సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన పటాకుల దుకాణాన్ని సమీపంలోని టిఫిన్ సెంటర్‌ను పరిశీలించాడు. సంఘటనకు గల కారణాలపై అధికారులతో చర్చించారు. దుకాణ యజమానులు తమ దుకాణాలను బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత దుకాణానికి సరైన అనుమతులు లేవని, బహిరంగ ప్రదేశంలో దీపావళి దుకాణానికి తాత్కాలిక అనుమతి మాత్రమే పొంది అవసరమైన అనుమతులు లేకుండా విక్రయాలు నిర్వహిస్తున్నట్లు స్థానిక అధికారులు రంగనాథ్ కు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారి, ఇన్స్పెక్టర్ రాంబాబు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed