- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భారీ బందోబస్త్తో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు.. సాయి ఐశ్వర్య కాలనీలో హై టెన్షన్
దిశ, మేడిపల్లి: సాలార్జింగ్ కంచెలో భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయి ఐశ్వర్య కాలనీ, సాలార్జింగ్ కంచె సర్వే నంబర్ 1,10, లో సోమవారం ఉదయం నుంచి అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరుపుతున్నారు. మేడిపల్లి మండల తహసీల్దార్ హసీనా వారి సిబ్బంది ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పలు నిర్మాణాలు కూల్చి వేస్తున్నారు. తమకు అన్ని అనుమతులు ఉన్నా కావాలనే తమ ఇండ్లు కులుస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ సందర్భంగా కూల్చివేతలు అడ్డుకున్న కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కూల్చివేతలు జరుగుతున్నాయాని మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ నాయకులు బరితెగింపు చర్యలని అన్నారు. తనను అడిగితే వెంటనే రాజీనామా చేస్తానని, పేదవారిని పావులు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దని ఫైర్ అయ్యారు.