Mumbai: దారుణం.. మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

by Shamantha N |
Mumbai: దారుణం.. మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని చెంబూరులో విషాదం జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల భవనంలో ఈరోజు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారని అధికారులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచే దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఆ మంటలు మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపేరషన్ చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే వారు చనిపోయిటన్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా.. మొదటి అంతస్తులో నివసించే కుటుంబ సభ్యులు మంటల వల్ల చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను పారిస్ గుప్తా, నరేంద్ర గుప్తా, మంజు ప్రేమ్ గుప్తా, అనితా గుప్తా, ప్రేమ్ గుప్తా, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story