Mahesh Goud: కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే!

by Shiva |
Mahesh Goud: కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణుల దాడి.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు సర్వ సాధారణమని అన్నారు. ముఖ్యంగా విమర్శలు చేసే సమయంలో భాష చాలా ముఖ్యమని పేర్కొన్నారు. దాడులు, ప్రతిదాడులను ఏ ఒక్కరూ సమర్ధించరని అన్నారు. అయినా, కౌశిక్‌రెడ్డిపై దాడితో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అరికెపుడి గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ సభ్యుడేనని.. నిబంధనల మేరకే ఆయన పీఏసీ చైర్మన్ అయ్యారని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed