బోసిపోయిన తహశీల్దార్ కార్యాలయం..

by Sumithra |
బోసిపోయిన తహశీల్దార్ కార్యాలయం..
X

దిశ, గుండుమాల్ : గుండుమాల్ మండల కేంద్రంలో గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ లు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. తహశీల్దార్ భాస్కర్ స్వామి వ్యక్తిగత సెలవుల పై వెళ్లారు. సోమవారం డివైస్ ఫింగర్ పని చేయలేదు మంగళ, బుధవారం ప్రత్యేక అధికారులను నియమించక పోవడంతో తహశీల్దార్ కార్యాలయం బోసిపోయింది. అధికారుల పూర్తి సమాచారం లేకపోవడంతో రైతులు రోజు వచ్చి తహశీల్దార్ కార్యాలయానికి దర్శించుకుంటున్నారు. పిల్లల సర్టిఫికెట్స్ సకాలంలో అందుతలేవని విద్యార్థులు వాపోతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి ఇంచార్జి అధికారులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Next Story