ఈ జిల్లా నిరుద్యోగులకు సూపర్ న్యూస్

by Naveena |

దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు18 నుంచి 35 సంవత్సరాల లోపు పాటు.. ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికైన నిరుద్యోగులకు శిక్షణ అనంతరం కర్నూలు, గద్వాల జిల్లాలో..వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వినూత్న ఫర్టిలైజర్స్ కంపెనీ నుంచి 150 ఖాళీలు ఉన్నట్లు..ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళా ఈ నెల 7వ తేదీన ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బీసీ స్టడీ సర్కిల్, గద్వాల మొదటి రైల్వేగేట్ దగ్గర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు సెల్ నెంబరు 8309921730 కు సంప్రదించాలని కోరారు.

Advertisement

Next Story