పంచాయతీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

by Naveena |
పంచాయతీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
X

దిశ అచ్చంపేట రూరల్: అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు,పంచాయతీ అధికారులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం విడి గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. త్రాగునీరు,పారిశుద్ధ్యం విద్యుత్ వంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శుల పనితీరు ఏమాత్రం బాగాలేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ శాఖ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story