కాల్వలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యల్లో రెస్క్యూ టీం

by karthikeya |   ( Updated:2024-10-14 07:54:55.0  )
కాల్వలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యల్లో రెస్క్యూ టీం
X

దిశ బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గ్రామానికి చెందిన ఈర్ల రాము (32) అనే వ్యక్తి కేఎల్ఐ కాలువలో పడి గల్లంతయిన వార్త ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేమాన్ గ్రామానికి చెందిన రాము ఆదివారం ఉదయం గ్రామం నుంచి బైక్‌పై గౌరారం వెళుతుండగా ప్రమాదవశాత్తు మంగనూరు గ్రామ శివారులో గల కేఎల్ఐ కాల్వలో పడిపోయాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బిజినేపల్లి ఎస్సై నాగ శేఖర రెడ్డి వెంటనే స్పందించి రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. సోమవారం ఉదయం నుంచి కేఎల్ఐ కాలువలో ముమ్మరంగా గాలిస్తున్నారు. కానీ ఇప్పటికీ రాము ఆచూకీ తెలియరాలేదు. రాము గల్లంతైన వార్త విని ఆతడి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Next Story

Most Viewed