ఘనంగా గద్దర్ విగ్రహ ఆవిష్కరణ

by Naveena |
ఘనంగా గద్దర్ విగ్రహ ఆవిష్కరణ
X

దిశ, అచ్చంపేట : నల్లమల ప్రాంతంలోని నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గ్రామంలోని అంబేద్కర్ కూడలి వద్ద గద్దర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘనంగా ఆవిష్కరించారు. గద్దర్ విగ్రహానికి పూలు చల్లుతూ నివాళులు అర్పించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి అత్యధికంగా గద్దర్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విగ్రహ స్థలం నుంచి సభాస్థలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విగ్రహ దాత గద్దర్ దళం మట్టి మేధావి ఫౌండర్ ప్రెసిడెంట్ కొల్లూరి సత్తయ్య, విమలక్క, రచయిత కవి కంచ ఐలయ్య, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి,గద్దర్ కూతురు వెన్నెల, ఏపూరి సోమన్న, అచ్చంపేట మున్సిపల్ కమిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కళాకారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed