పీసీసీ సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్న నేతలు

by M.Rajitha |
పీసీసీ సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్న నేతలు
X

దిశ, వెబ్ డెస్క్ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్(Congress) పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ మేరకు నేడు గాంధీ భవన్ లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గాల ఇంచార్జ్ లు, ప్రజాప్రతినిధులతో పీసీసీ(PCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం వంటి పలు విషయాల మీద చర్చ జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు పీసీసీ అధ్యక్షుని ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులను మాత్రమే పట్టించుకుంటున్నట్టు, తమను చిన్నచూపు చూస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల్లో చేపడుతున్న పలు కార్యక్రమల్లో పార్టీ ఫిరాయించిన వారికి ఆహ్వానాలు అందుతున్నాయి కానీ, ఎన్నో ఏళ్ల నుండి పార్టీ కోసం పని చేస్తున్న తమకు ఎలాంటి ఆహ్వానాలు అందడం లేదని.. అసలు తమని పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇకనుండి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం.

Next Story

Most Viewed