KTR: మన బడి పిల్లలకు అందాల్సింది ఇదేనా? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

by Ramesh Goud |
KTR: మన బడి పిల్లలకు అందాల్సింది ఇదేనా? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం గారూ.. మన బడి పిల్లలకు అందాల్సిన దారుణమైన ఆహారం ఇదేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.బడి పిల్లలకు గోడ్డుకారం, నూనె పెడుతున్నారన్న ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబందించిన ఫోటోతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడి పిల్లలకు అందించిన మెనూ లిస్ట్ ను జత చేసి పోస్ట్ చేశారు. దీనిపై నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు.. దీంతో పిల్లలకు గొడ్డు కారం, నూనె పోసి ఇవ్వగా పిల్లలు దాంతోనే కడుపు నింపుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై మన బడి పిల్లలకు అందాల్సిన దారుణమైన ఆహారం ఇదేనా? అని తెలంగాణ సీఎంను నిలదీశారు. పాఠశాల విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా ప్రారంభించిన అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కారణం లేకుండా రద్దు చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఇలాంటి రిపోర్టులు షాకింగ్‌గా కనిపిస్తున్నాయని చెబుతూ.. తెలంగాణ సీఎస్ గారు అన్ని పాఠశాలల్లోని పరిస్థితిని వీలైనంత త్వరగా సమీక్షించాలని ఎక్స్ ద్వారా కేటీఆర్ కోరారు.

Advertisement

Next Story