రైతు డెవలప్ మెంట్ కు రెండు సూత్రాలు: కోదండరెడ్డి

by Y.Nagarani |
రైతు డెవలప్ మెంట్ కు రెండు సూత్రాలు: కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు డెవలప్ మెంట్ కు రెండు సూత్రాలు పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన బీఆర్కే భవన్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం, రైతు సంక్షేమం అని రెండుగా విభజించుకొని ప్రభుత్వం పకడ్భందీగా ముందుకు వెళ్తుందన్నారు. రైతుకి ఒకప్పుడు సమాజంలో బాగా గౌరవం ఉండేదని, కానీ గడిచిన పదేళ్లలో ఈ పరిస్థితులు కానరావడం లేదన్నారు. రైతు తనకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేకమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.

అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సాహసోపేతమైన, ఆర్థికపరమైన నిర్ణయం తీసుకొని ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేశారన్నారు. దీంతో పాటు సన్న వడ్లకు అదనంగా బోనస్ రూ.500 రూపాయలు ప్రకటించారన్నారు. ఇక రాబోయే పంటకాలానికి రైతు భరోసా కార్యక్రమం కింద అర్హులైన రైతులకి రూ.7500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారన్నారు. శక్తివంచన లేకుండా పనిచేసే రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story