‘మొసలి కన్నీళ్లు వద్దు’.. రాహుల్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Satheesh |
‘మొసలి కన్నీళ్లు వద్దు’.. రాహుల్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కనీస మద్దతు ధరపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదని చురకలంటించారు. మద్దతు ధరపై మొసలి కన్నీళ్లు వద్దని సెటైర్ వేశారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయలేమని 2013లో పార్లమెంట్ సాక్షిగా మీరే చెప్పారని.. సభలో చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు రూ.15 వేల ఆర్థిక సహయం, వరికి రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల క్షేమానికి కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed