కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు

by Gantepaka Srikanth |
కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోందని, కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట అని, అంకెల గారడీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి రాగానే.. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయడమే తమ మొదటి లక్ష్యమని వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ చెప్పిందని, కానీ అధికారంలోకి వచ్చిన 224 రోజుల తర్వాత కూడా రైతుల రుణాలు సగం మాత్రమే మాఫీ అయ్యాయని పేర్కొన్నారు.

ఇలా పచ్చి అబద్ధాలతో తెలంగాణ రైతులను నిట్టనిలువునా కాంగ్రెస్ మోసం చేస్తోందని ఫైరయ్యారు. అసలు తెలంగాణలో పంటరుణాలు తీసుకున్న రైతులెందరు? రూ.2లక్షల్లోపు రుణాలున్నవారెందరు? మీరు రుణమాఫీ చేసిన వారెందరు? ఈ లెక్కలన్నీ తెలంగాణ ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పినదాంట్లో మూడోవంతు రైతులకు కూడా రుణమాఫీ చేయలేదనేది వాస్తవమని ఆయన తెలిపారు. తెలంగాణ రైతుల్లో ఈ అయోమయం తొలగిపోవాలంటే.. లెక్కలు ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story