Kishan Reddy: నిజాం అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-17 15:35:21.0  )
Kishan Reddy: నిజాం అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపించారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి(Gudur Narayana Reddy)ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఘనంగా సన్మానించారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా మంగళవారం నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో నారాయణ రెడ్డిని సన్మానం చేశారు. నిజాం అరాచకాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించేలా రజాకార్ సినిమాను నిర్మించారని కేంద్ర మంత్రి కొనియాడారు. సన్మానం అనంతరం గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం అరాచకాలు అన్నీ.. ఇన్నీ కావని, మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గూడూరు సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed