- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి
by Sridhar Babu |
X
దిశ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి జిల్లా పరిధిలోని చెరువులను రక్షించడంతోపాటు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కోరారు. శనివారం ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా చుంచుపల్లి మండల పరిధిలోని చింతలచెరువు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. చెరువు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు స్వాధీనం చేసుకొని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. అదే విధంగా సింగభూపాలెం చెరువును సైతం పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మంలో అనేకమంది నష్టపోయారని, వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story