- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
TGSRTC: ఎయిర్ పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక నుంచి ఆ బస్సుల్లో రాయితీ!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎయిర్ పోర్ట్కు వెళ్లే బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి పుష్పక్ బస్సు టికెట్ ధరల్లో రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బస్సుల్లో చేరుకునే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పుష్పక్ బస్సుల్లో ఎయిర్ పోర్ట్కు వెళ్లే వారికి టికెట్ ధరల్లో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి గ్రూప్గా ఎయిర్ పోర్ట్కు పుష్పక్ బస్సుల్లో ప్రయాణం చేస్తే వారికి అదనంగా మరో 10 శాతం కలిపి మొత్తం 20 శాతం డిస్కౌంట్ను అందించాలని నిర్ణయించింది. ఈ ఆఫర్ కేవలం సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఇక ఈ రాయితీ సదుపాయాన్ని వినియోగించుకొని క్షేమంగా పుష్పక్ బస్సుల్లో ఎయిర్ పోర్ట్కు చేరుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది. ఈ రాయితీకి సంబంధించిన సమాచారాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.