Crime: కొత్తగూడెంలో దారుణం.. తల్లిని హత్య చేసి కుమారుడు ఆత్మహత్య

by Mahesh |
Crime: కొత్తగూడెంలో దారుణం.. తల్లిని హత్య చేసి కుమారుడు ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని కిరాతకంగా కొట్టి హత్య చేసి అనంతరం తనయుడు ఉరేసుకున్న ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిద గడ్డ ఏరియాలో నివాసం ఉంటున్న తల్లి తుల్జా కుమారిని కుమారుడు వినయ్ కుమార్ కిరాతకంగా హత్యగావించి అనంతరం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ రెహమాన్, త్రీ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ కొనసాగి కొనసాగిస్తున్నారు.



Next Story