- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజలు రామరాజ్యాన్ని కోరుకుంటున్నారు
దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో కి వచ్చిన సందర్భంగా ఆయనకు ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. స్థానిక సాయిబాబా గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాయిబాబా గుడి వద్ద నుండి జూలూరుపాడు పోలీస్ స్టేషన్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీకి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంలో ఈసారి బీజేపీ 400 ఎంపీ సీట్లను
గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు రామరాజ్యం కోరుకుంటున్నారని, 600 సంవత్సరాల కల నెరవేర్చిన మోడీని మళ్లీ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇండ్లు ఇస్తామని, రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈసారి ఖమ్మంలో ప్రజలు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నారని, తనను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరి రమేష్, మాదినేని సతీష్, నున్న రమేష్, దొడ్డా భారతి, సిరి పురపు ప్రసాద్ పాల్గొన్నారు.