- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న వార్త.. స్టార్ హీరోయిన్ తల నరికి బస్సులోంచి పడేసిన దుండగులు
దిశ, వెబ్డెస్క్: ఎవరైనా సరే ఒకసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక స్టార్ గుర్తింపు తెచ్చుకుని ఏళ్లపాటు కొనసాగాలని భావిస్తారు. కొంతమందికి నటనలో కలిసి రాక పరిశ్రమకు దూరమవుతారు. మరికొంతమంది కావాలనే సినీ రంగానికి దూరంగా ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఊహించని ఘటనతో ఇండస్ట్రీకి కాదు.. ఏకంగా జీవితానికే ముగింపు పలికింది. చిన్న చిన్న రోల్స్లో నటిస్తూ అప్పుడే ప్రేక్షకులను దగ్గరైన ఓ హీరోయిన్ను తన ఫ్రెండ్సే కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చడం బాలీవుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. మీనాక్షి థాపా అనే అనే బాలీవుడ్ హీరోయిన్.. మధుర్ భండార్కర్ తెరకెక్కించిన చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇందులో కరీనా కపూర్ ముఖ్య పాత్ర పోషించగా.. మరో కథానాయికగా మీనాక్షి నటించాల్సి ఉంది.
కీలక పాత్రలో ఛాన్స్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. మీనాక్షి షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో కిడ్నాప్కు గురైంది. అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సూరిన్లు ఈమెను కిడ్నాప్ చేసి.. మీనాక్షి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. పైగా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే తన అసభ్యకర ఫొటోలు, వీడియోలు బయటపెడ్తామని బెదిరించారట. ఏం చేయాలో అర్థం కాని మీనాక్షి పేరెంట్స్ పోలీసు కంప్లైంట్ ఇవ్వగా.. ఆ దుండగులిద్దరు ఆమెను దారుణంగా హింసించి తల నరికి బస్సులో నుంచి బయటపడేశారట. పోలీసుల విచారణలో మీనాక్షి తల తన బాడీ వాటర్ ట్యాంక్ లో పడేసి ఉన్నట్లు తేలిందట. గతంలో జరిగిన ఈ హత్యలో నిందితులకు కోర్టు జీవితఖైదు శిక్ష విధించిందట.