దారుణం.. దోమల మందు తాగిన మున్సిపల్ కార్మికురాలు మృతి

by Nagam Mallesh |
దారుణం.. దోమల మందు తాగిన మున్సిపల్ కార్మికురాలు మృతి
X

దిశ, కొత్తగూడెం : మంచినీళ్లు అనుకొని దోమల మందు తాగిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు బత్తుల ఓదమ్మ(65) శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. శుక్రవారం ఉదయం మున్సిపాలిటీలో 8వ వార్డులో దోమల మందు ఫాగింగ్ చేసే సమయంలో, వాటర్ బాటిల్ లో ఉన్న దోమల మందను మంచినీరు అనుకుని పొరపాటున తాగింది. అస్వస్థతకు గురికావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓదమ్మ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Advertisement

Next Story

Most Viewed