గిరిజనులతో మా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు.. వృద్ధ దంపతుల ఆవేదన

by Sumithra |
గిరిజనులతో మా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు.. వృద్ధ దంపతుల ఆవేదన
X

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గిరిజనులతో గుడిసెలు వేయించి తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని గ్రామానికి చెందిన విష్ణుమొలకల వెంకట క్రిష్ణారావు దంపతులు ఆరోపించారు. సోమవారం లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తమ గోడును వెల్లడించారు. గ్రామంలోని సర్వే నంబర్ 110లో 23 సెంట్ల భూమిలో తాము నివాసం ఉంటున్నామని, పంచాయితీ పన్ను కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ నివాసస్థలం పై కన్నువేసి విలువైన భూమిని ఆక్రమించుకోవాలని నకిలీ డాక్యుమెంట్లతో ప్రయత్నం చేశాడని వెల్లడించారు. ఈ విషయంపై తాము జిల్లా కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని తెలిపారు.

తీర్పు కాఫీని బూర్గంపాడు తాహశీల్దార్, ఎస్సైలకు అందించామని వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం తమ స్థలంలో ఉన్న కంటైనర్ ఇంటిని గిరిజనులతో ధ్వంసం చేయించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ధ్వంసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయగా, మరోసారి శనివారం తమ స్థలంలో గిరిజనులతో లక్ష్మీపురం గ్రామానికి చెందిన గులాబీ నేత గుడిసెలు వేయించాడని ఆరోపించారు. గుడిసెలు వేసే క్రమంలో తాము అడ్డుకొనే ప్రయత్నం చేయగా తమ పై దౌర్జన్యానికి పాల్పడ్డారని, దీంతో 100కు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారని తెలిపారు. ఎంతో విలువైన తమ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని చూస్తున్న వ్యక్తితో పాటు స్థలాన్ని ఆక్రమించుకొనే ప్రయత్నం చేస్తున్న గిరిజనులతో తమకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్, ఎస్పీలు కలగచేసుకొని తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed