తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు సూసైడ్

by Kalyani |
తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు సూసైడ్
X

దిశ,మానకొండూరు : తండ్రి మరణం తట్టుకోలేక కొడుకు మద్యానికి బానిసై రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దదిక్కులేకుండా పోవడంతో కెళ్లేడు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కెళ్లేడు గ్రామానికి చెందిన కట్ట వెంకటేష్ (35)అనే యువకుడు తన తండ్రి గత నాలుగు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో కొడుకు మనస్థాపానికి గురై మద్యం సేవిస్తూ తండ్రి లేడని బెంగతో ఈ నెల 4న సాయంత్రం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. మృతుడి భార్యకు సమాచారం అందటంతో వెంటనే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం మృతి చెందాడని మృతుడి భార్య కట్ట భవాని ఫిర్యాదు మేరకు మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed