- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కచ్చితంగా తెలంగాణలో రామరాజ్యం: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందు నువ్వు ఇచ్చిన అబద్ధపు, తప్పుడు వాగ్ధానాలు నెరవేర్చమని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రజలకు మాయమాటలు చెప్పి ముఖ్మమంత్రి గద్దెనెక్కినాడని అన్నారు. అదే విధంగా నేడు జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. కానీ ఇప్పుడు సీఎం ఎన్ని రకాల మాయ మాటలు చెప్పిన ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని అన్నారు. రేపు కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందని వెల్లడించారు.
ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన తప్పుడు, అబద్ధపు వాగ్ధానాలు నెరవేర్చే ప్రయత్నం చేయమని డిమాండ్ చేశారు. తన మీదున్న అవినీతి, ఆరోపణలు కడుక్కునే ప్రయత్నం చేయమని సూచించారు. రేవంత్ రెడ్డిపై వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పమని, ఈ రోజుకు నీ మీదున్నటువంటి ఓటుకు నోటుకు కేసులు తుడుచుకునే ప్రయత్నం చేయమని.. అంతేకానీ పెద్ద నాయకుల్ని పట్టుకుని విమర్శలు చేసినంతా మాత్రాన నువ్వు పెద్ద నాయకుడివి కాలేవని హితవు పలికారు. అలాగే రేవంత్ రెడ్డి 14 సీట్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాయం తీసుకుంటానని ఇప్పటికే చెప్పానని మహేశ్వర్ రెడ్డి మరోసారి గుర్తుచేశారు.