తెలంగాణను నాశనం చేస్తానంటే.. విశ్రమించకుండా యుద్ధం చేస్తా: KCR

by Disha Web Desk 19 |
తెలంగాణను నాశనం చేస్తానంటే.. విశ్రమించకుండా యుద్ధం చేస్తా: KCR
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్‌లో పర్యటించిన కేసీఆర్.. రోడ్డు షోలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలవగానే క్షణాల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. మరీ హామీ ఇచ్చినట్లుగా చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు నిధులు అందలేదని ఫైర్ అయ్యారు. పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని అన్నారు.. మరీ ఇచ్చారా అని ప్రశ్నించారు.

స్వరాష్ట్రాన్ని సాధించిన తన కళ్లముందే తెలంగాణను నాశనం చేస్తానంటే విశ్రమించకుండా యుద్ధం చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్లలో ప్రధాని మోడీ ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని ఫైర్ అయ్యారు. 150 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి తెలంగాణకు కేటాయింలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో మోడీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed