ఆదమరిస్తే అంతే సంగతి... అధ్వానంగా మారిన రోడ్డు..

by Sumithra |
ఆదమరిస్తే అంతే సంగతి... అధ్వానంగా మారిన రోడ్డు..
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోనీ బొమ్మేనా తక్కళ్ళపల్లి గ్రామాల మధ్య రోడ్డు అధ్వానంగా తయారయింది. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఏండ్లు గడుస్తున్న, ప్రభుత్వాలు మారినా ఆ రోడ్డు దుస్థితి మాత్రం మారడం లేదు. కథలాపూర్ మండలంలో గల బొమ్మెన - తక్కళ్లపల్లి రెండు గ్రామాల మధ్యన గల రోడ్డు ప్రస్తుత పరిస్థితి అధ్వానంగా తయారయింది. వానాకాలం వచ్చింది అంటే ఇక అంతే సంగతి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఇప్పటి వరకు ఈ రోడ్డు గుండా ఎంతో మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వస్తుంటారు, పోతుంటారు కానీ ఈ రోడ్డు పట్ల కాస్తయినా జాలి, కనికరం చూపెట్టడం లేదనేది ఆ గ్రామాల ప్రజల మధ్య చర్చ జరుగుతుంది. ఇక ఆర్ అండ్ బీ అధికారులకు పరమాల్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదని వాహనదారులు వాపోతున్నారు. వాహనదారుల మరో వాదన మా రోడ్డు బ్రతుకు చిద్రమేనా అంటూ పాదాచారులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. ఇకనైనా ఆ దేవుడు ప్రజాప్రతినిధుల, అధికారుల మనసు మార్చి మా రోడ్డు పట్ల దయతో వ్యవహరించేలా చూడాలని, ప్రమాదాలు జరగక ముందే రోడ్డు వేయాలని ఆ గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed