క్రీడాకారుల దుస్థితి.. చెప్పుకోలేని పరిస్థితి..

by Aamani |
క్రీడాకారుల దుస్థితి.. చెప్పుకోలేని పరిస్థితి..
X

దిశ, రామడుగు : గత ప్రభుత్వ పాలకుల తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇచ్చిన హామీల్లో ఇలా బోర్డులకే పరిమితమై ఉపయోగపడని విధంగా ఈ క్రీడ బోర్డ్ ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితేరామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థలం వాగులో ఏర్పాటు చేయడంపై దీన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రీడా మైదానం లేకున్నా బోర్డులను మాత్రం పెట్టి బిల్లులు తీసుకున్న పరిస్థితి తప్ప క్రీడాకారులకు ఒరిగిందేమీ లేదంటున్నారు. కాగా గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి పొర్లలడంతో రోడ్డు తో పాటు బోర్డును తాకుతూ ప్రవాహం కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే హైదరాబాద్ ను ఒక క్రీడా హబ్ తో పాటు క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని పేర్కొనడం పక్కన పెడితే ఇలా వాగుల్లో ఏర్పాటు చేసినటువంటి బోర్డులను ఈ ప్రభుత్వం తీసి క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు క్రీడాకారులు.

Advertisement

Next Story

Most Viewed