నిరుపయోగంగా సింగరేణి భవనం.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..

by Aamani |
నిరుపయోగంగా సింగరేణి భవనం.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..
X

దిశ,గోదావరిఖని: గోదావరిఖని లోని విట్టల్ నగర్ పార్క్ పక్కన గల సింగరేణి భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం సింగరేణి అధికారుల కొరకు నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ భవనం నిరుపయోగంగా ఉండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. రాత్రి వేళలో మందుబాబులకు అడ్డగా మారిందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఆ దారి వెంట కాలేజీ విద్యార్థులు, మహిళలు పోవడానికి జంకుతున్నారు. అంతేకాకుండా సింగరేణి భవనంలో విచ్చలవిడిగా చెట్లు పెరగడంతో పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు భవనాన్ని ఉపయోగానికి తీసుకురావాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed