MLA Kavvampally : టెండర్లు పిలిచి పనులు చేపట్టండి..

by Aamani |
MLA Kavvampally : టెండర్లు పిలిచి పనులు చేపట్టండి..
X

దిశ, తిమ్మాపూర్ : మానకొండూరు నియోజకవర్గానికి మంజూరైన రూ. 4.90 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి సత్వరమే పనులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఆ శాఖకు సంబంధించిన పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిమ్మాపూర్, గన్నేరువరం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు,టాయిలెట్లు, వంటగదుల నిర్మాణ పనులకు రూ. 4.90కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఆయా పనులు చేపట్టేందుకు వీలుగా వెంటనే టెండర్లు ఆహ్వానించాలన్నారు.

అర్హులైన టెండరు దారులకు పనుల కాంట్రాక్ట్ అప్పగిస్తూ వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.పనుల్లో నాణ్యత లోపించకుండా ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయించాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీర్లు చంద్రశేఖర్ (కరీంనగర్ ), భూమేశ్వర్ (సిరిసిల్ల) డీఈలు మంజుభార్గవి, రవి ప్రసాద్ తో పాటు ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed