- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ప్రజావాణి ఎదుట దివ్యాంగుడి నిరసన
by Aamani |
X
దిశ, జగిత్యాల టౌన్ : తనకు వికలాంగుల పెన్షన్ తో పాటుగా బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి వికలాంగుడి గా మారాడు. అప్పటి నుండి పనులకు వెళ్లలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందిగా పడుతున్నానని వాపోయాడు. అయితే గతంలో ఇచ్చిన ట్రై సైకిల్ పాడైపోయిందని, తనకు బ్యాటరీ సైకిల్ , పెన్షన్ ఇవ్వాలని అధికారులను కోరాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ బాధితుడికి సైకిల్, పెన్షన్ సౌకర్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story