దిశ ఎఫెక్ట్... విద్యానగర్ లో వైద్య శిబిరం

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... విద్యానగర్ లో వైద్య శిబిరం
X

దిశ, హుజురాబాద్ రూరల్ : పట్టణంలోని విద్యానగర్ లో అధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. దిశ దినపత్రికలో డెంగ్యూతో బాలిక మృతి అనే కథనం సోమవారం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైద్యాధికారులు వార్డులో వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే జ్వర సర్వే నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. మురుగుకాల్వల్లో, రోడ్లపై మందులు స్ప్రే చేశారు. యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించారు.

అలాగే బుడిగ జంగాల కాలనీలో కూడా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్పూర్ వైద్యాధికారి మధుకర్ మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొబ్బరి బోండాలను, పాత టైర్లను ఇంటి ఆవరణలో పెట్టుకోరాదని కోరారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జరీనా, హెచ్ ఈ ఓ విజయేందర్ రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ మల్లయ్య, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed