బీజేపీ నేతలతో జేపీ నడ్డా సమావేశం.. హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక నేతలు

by Mahesh |
బీజేపీ నేతలతో జేపీ నడ్డా సమావేశం.. హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మెంబర్ షిప్ కార్యక్రమం ఉవ్వెత్తున కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకొని.. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై నేతలతో జేపీ నడ్డా చర్చ చర్చించి రాష్ట్రంలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అలాగే సభ్యత్వ నమోదును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర నేతలకు ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు హైదరాబాద్ చేరుకున్న నడ్డాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Next Story

Most Viewed