బీఆర్ఎస్ పార్టీకి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్

by Mahesh |
బీఆర్ఎస్ పార్టీకి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ పని మానుకొవాలని మంత్రి హెచ్చరించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోయిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం తో తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. వచ్చే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. బీఆర్ఎస్ నేతలు పనిగట్టుకొని అబద్దాలను ప్రచారం చేడయం మానుకోవాలన్నారు. అలాగే రుణమాఫీని పటిష్టంగా నిర్వహించామని గుర్తు చేశారు. రుణమాఫీ పై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ.. రైతలును రెచ్చగొడుతూ.. ఆందోళనకు గురయ్యేలా.. చేస్తున్నారని.. అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీకే నష్టం అని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story