హైదరాబాద్‌కు చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ జట్లు.. రాత్రికి అక్కడే బస

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-10 16:09:32.0  )
హైదరాబాద్‌కు చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ జట్లు.. రాత్రికి అక్కడే బస
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా టీమిండియా(Teamindia) వర్సెస్ బంగ్లాదేశ్(Bangladesh) మధ్య టీ20 మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. మ్యాచ్ కోసం గురువారం సాయంత్రమే టీమిండియా, బంగ్లాదేశ్ టీమ్‌లు హైదరాబాద్‌(Hyderabad)కు చేరుకున్నాయి. గురువారం రాత్రికి పార్క్ హయత్‌లో టీమిండియా, తాజ్ కృష్ణలో బంగ్లాదేశ్ టీమ్‌లు బస చేయనున్నాయి. ఈనెల 12వ తేదీన మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే మైదానంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మ్యాచ్ టికెట్లను సైతం పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్ లేదా యాప్‌లో అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ అధికారులు పేర్కొన్నారు. టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750 ఉండగా.. గరిష్ఠ ధర రూ.15 వేలుగా ఉంటుందని తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఆన్ లైన్‌లో బుక్ చేసిన టిక్కెట్లను రిడంషన్ చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో వచ్చి టిక్కెట్లు తీసుకోవచ్చని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed