- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓయూలో ఆంక్షలు విధించడం దుర్మార్గం : కేటీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఓయూ ఆంక్షలు విధించడంపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీకట్టిందని పేర్కొన్నారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న ముఖ్యమంత్రి, నిరసనలపై ఉక్కుపాదం మోపడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును కాపాడతామని అభయహస్తం మేనిఫెస్టోలోని మొదటి పేజీ, మొదటి లైన్లో ఇచ్చిన హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కకూడదని అల్టీమేటం జారీచేయడం ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తున్నదని తెలిపారు. విద్యార్థులు తినే భోజనంలో ఇటీవల పురుగులే కాకుండా ఏకంగా బ్లేడ్లు కూడా దర్శనమివ్వడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచిందని తెలిపారు. అలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాల్సింది పోయి విద్యార్థులను అణచివేయాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. నిర్బంధ పాలనతో విశ్వవిద్యాలయం విద్యార్థుల గొంతునొక్కే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే నియంత పాలనకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.