MLA Talasani : సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉంటాం

by Kalyani |
MLA Talasani : సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉంటాం
X

దిశ, బేగంపేట : సీనియర్ సిటిజన్స్ కు అన్ని విధాలుగా అండగా ఉంటానని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (MLA Thalasani Srinivas Yadav) హామీ ఇచ్చారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఎస్సార్ నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ కమిటీ సభ్యులు సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తమ వయసును సైతం లెక్కచేయకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ ను ప్రశంసించారు.

కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి చేపడుతున్న కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చానని, ఇక ముందు కూడా అది కొనసాగిస్తానని చెప్పారు. తమకు అనేక విధాలుగా అండగా ఉంటూ చేయూతను అందిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, కౌన్సిల్ నూతన అధ్యక్షుడు దూబే, ఉపాధ్యక్షుడు అనంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ దేవ్ గౌడ్, కోశాధికారి యాదగిరి జాయింట్ సెక్రెటరీ శంకర్, మాజీ అధ్యక్షులు పార్థసారథి, మాణిక్ రావ్ పాటిల్, కృష్ణారెడ్డి, బాల్ రాజ్ యాదవ్, కుమార్, సుందర్ నాయి, అరవింద్ గౌడ్, మాణిక్ రావ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed