- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
పూల పండ్ల వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
దిశ, ఎల్బీనగర్ : రైతు బజార్ సమీపంలో ఫుట్ పాత్ పై వ్యాపారం నిర్వహించుకుంటున్న పూల పండ్ల వ్యాపారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు బాధ్యతగా మీకు న్యాయం చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. గురువారం వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో పూల వ్యాపారులు వారి షెడ్డు తొలగించడంతో మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వ్యాపార లను ఉద్దేశించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నేను గత మూడు నెలల నుంచి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని ఈ కారణంగా నేను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోయానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. మీరు లేని సమయంలో పోలీస్ ట్రాఫిక్ అధికారులు దాడి చేసి మా వ్యాపారాలను రోడ్డు పాలు చేశారని మాకు న్యాయం చేయాలని బాధితులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చింతల రవికుమార్ ,సత్తిరెడ్డి ,చిరంజీ, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.