ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కుమార్

by Aamani |
ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కుమార్
X

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ 29వ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ఎం కుమార్ బాధ్యతలు చేపట్టారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆయన శనివారం పరిపాలన భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఓయూ అధ్యాపకులు, అధికారులతో సెనేట్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు విద్యార్థులు, ఉద్యోగులు, అధ్యాపకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. యూనివర్సిటీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దృష్టి సారిస్తానని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed