వ్యాపారంలో పార్ట్నర్ షిప్ పేరుతో కోట్లల్లో కుచ్చు టోపీ.. దంపతుల అరెస్ట్

by Aamani |
వ్యాపారంలో పార్ట్నర్ షిప్ పేరుతో కోట్లల్లో కుచ్చు టోపీ.. దంపతుల అరెస్ట్
X

దిశ, బేగంపేట: తన పరిశ్రమలో పెట్టుబడి పెడితే ప్లాట్ ఇస్తానని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్ల రూపాయలు దండుకుని మోసగించిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన దంపతులపై బోయిన్ పల్లి,తిరుమలగిరి, మహంకాళి పోలీస్ స్టేషన్ కూడా చీటింగ్ కేసులు ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు చిక్కడపల్లి కి చెందిన హెచ్.దినేష్ (50), జ్యోతి (47) దంపతులు.వీరికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ శ్రీరామా ఇంటర్ పేరుతో హోల్ సేల్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కీసరలో అభినవ్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ తయారీ పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నారు.

తమ వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెడితే మంచి కమిషన్ తో పాటు పార్ట్నర్ షిప్ ఇస్తామని నమ్మించి పలువురి నుంచి రూ.కోట్లు దండుకున్నారు.ఈ క్రమంలోనే సికింద్రాబాద్ చెందిన వ్యాపారి పి.లక్ష్మణ్ (55)కు ఈ దంపతులు నమ్మించడంతో రూ.1.10 కోట్లు పెట్టుబడి పెట్టాడు.రేపోమాపో పార్ట్నర్ ఇస్తానని దంపతులు నమ్మిస్తూ వచ్చారు.ఇలా ఆరు నెలలు గడిచినా పార్ట్నర్ ఇవ్వకుండా మోసగించారు.తాను పెట్టిన పెట్టుబడి డబ్బులు వెనక్కి ఇచ్చిన వేయాలని లక్ష్మణ్ నిలదీశాడు.దీంతో దంపతులు నెల రోజుల క్రితం రూ.1.10 కోట్లకు చెక్ ఇచ్చారు. ఆ చెక్ బ్యాంక్ చెల్లకపోవడంతో బాధితుడు లక్ష్మణ్ సీసీఎస్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ ఎస్సై యుగేందర్ నిందితులైన జ్యోతి, దినేష్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.

Advertisement

Next Story

Most Viewed