నిరసనల వేళ కీలక పరిణామం.. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం నివాసంలో చర్చలు..!

by Mahesh |
నిరసనల వేళ కీలక పరిణామం.. గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రి పొన్నం నివాసంలో చర్చలు..!
X

దిశ, వెబ్ డెస్క్: గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలతో హైదరాబాద్ మహానగరం అట్టుడికిపోతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖలతో పాటు కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లు, జీవో 29 రద్దుపై రేపు ఉదయం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై గ్రూప్-1 అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed