రేషన్ కార్డుదారులకు మరోసారి గుడ్ న్యూస్.. ఆయిల్స్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన

by srinivas |
రేషన్ కార్డుదారులకు మరోసారి గుడ్ న్యూస్.. ఆయిల్స్‌పై ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పెరుగుతున్న ధరల దృష్టా రేషన్ కార్డు దారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో తక్కువ ధరకే ఆయిల్‌ను అందిస్తోంది. రూ. 110కే లీటర్ పామాయిల్, రూ. 124కే సన్ ఫ్లవర్ ఆయిల్ ఇప్పటికే పంపిణీ చేస్తోంది. అయితే ఈ ధరనే కొనసాగించాలని తాజాగా పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. వంట నూనెల దిగుమతిదారులతో మంత్రి మనోహర్ భేటీ అయి కేంద్రం దిగుమతి సుంకం పెంచడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు తగినంత ఆయిల్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సప్లైకి దిగుమతి దారుల నుంచి ఇబ్బందులు ఉండకూడదని, సప్లై పెంచుకోవాలన్నారు. సామాన్యుల ఇబ్బందులను తగ్గించడం కోసమే సబ్సిడీపై వంటనూనెలు అందిస్తున్నామని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed