పట్టపగలే చోరీ.. నగలు,నగదు స్వాహా

by Aamani |
పట్టపగలే చోరీ.. నగలు,నగదు స్వాహా
X

దిశ, జిన్నారం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం చోరీ జరిగిన ఘటన జిన్నారం మండలంలోని లక్ష్మీపతి గూడెం గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలంలోని లక్ష్మీపతి గూడెం గ్రామానికి చెందిన జనార్ధన్ దంపతులు ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి కూలి పనికి వెళ్లారు. ఇంటికి తాళం ఉండడంతో గమనించిన దుండగులు తాళాలు పగలగొట్టి మిట్ట మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో గల బీరువా తాళాలను పగలగొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారం, ఆరు తులాల వెండి, రూ.40 వేల నగదును దుండగులు అపహరించుకుపోయారు. కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన జనార్ధన్ దంపతులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గమనించారు. జనార్ధన్ చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed