ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం : సీపీ సుధీర్ బాబు

by Ramesh N |
ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం : సీపీ సుధీర్ బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ పండుగలు జరిగాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తాాజగా ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో చక్కటి సమన్వయంతో పనిచేశారని, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసిన అన్ని విభాగాల అధికారులు, నిర్వాహకులు, సిబ్బందిని ఈ సందర్భంగా కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా సాగేలా తగిన బందోబస్తు ఏర్పాట్లతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్లే సామరస్య వాతావరణంలో వేడుకలు జరిగాయని కమిషనర్ పేర్కొన్నారు.

అదే విధంగా ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మిలాద్-ఉన్-నబీ వేడుకలు కూడా ప్రశాంతంగా జరిగాయని, గణేష్ నవరాత్రి వేడుకలు, మిలాద్-ఉన్-నబీ పర్వదినం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నేహపూర్వక వాతావరణంలో జరగడం రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఉన్న సామరస్య వాతావరణానికి ప్రతీక అని కమిషనర్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed