ప్రజల అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలి : హైదరాబాద్ కలెక్టర్

by Aamani |
ప్రజల అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలి : హైదరాబాద్ కలెక్టర్
X

దిశ, కార్వాన్ : ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరంతరం కృషి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంబి కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన కమిటీ సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ ని కలిసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ సంఘం సభ్యులను కలెక్టర్ కు పరిచయం చేయగా కలెక్టర్ ఉద్యోగ సంఘ నాయకులను అభినందించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నతాధికారులను కలిశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కృష్ణ యాదవ్, జనరల్ సెక్రటరీ ఖదీర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పూనమ్, వైస్ ప్రెసిడెంట్ నామాల శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆశన్న, ఏంజుల రెడ్డి, కోశాధికారి వెంకట్ రమణ, మంచాల రవీందర్,సురేందర్ , ఉపాధ్యక్షుడు,రాజేందర్, ఉపాధ్యక్షుడు,వి.శ్రీ రాములు, జాయింట్ సెక్రటరీ, జిల్లా విద్యా అధికారి, కొటాజి , జిల్లా గిరిజన శాఖాధికారి ,మహ్మద్ గౌస్, జాయింట్ సెక్రటరీ, రవీందర్,వెంకట్రాంరెడ్డి, జాయింట్ సెక్రటరీ, రమేష్,గోపాలకృష్ణ,సందీప్ కుమార్ ,జూపల్లి నర్సింగరావు, శ్రావన్ కుమార్ రెడ్డి ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed